- శామ్సంగ్ మొబైల్ బిజినెస్ హెడ్ టి.ఎం. రోహ్
గురుగ్రామ్: ఇండియాలో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు విపరీత ఆదరణ కనిపిస్తోందని శామ్సంగ్ తెలిపింది. ఎక్కువ మంది ప్రీమియం స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని, వీటిలో ఫోల్డబుల్స్ ఫోన్లూ ఉన్నాయని కంపెనీ మొబైల్ బిజినెస్ హెడ్ టిఎం రోహ్ అన్నారు. “ఫోల్డబుల్స్ విపరీతంగా పెరుగుతున్న మార్కెట్లలో భారతీయ మార్కెట్ ఒకటి. ఈ వృద్ధిలో అత్యంత కీలకమైన గెలాక్సీ ఫోల్డబుల్స్ ఉన్నాయి.
ఈ సంవత్సరం మార్కెట్ డిమాండ్ పెరుగుతుందని మేం అంచనా వేస్తున్నాం. కస్టమర్లు కొత్త గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6ని బాగా ఆదరించారు. జెడ్ సిరీస్లోని ఏఐ ఫీచర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి”అని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి 200 మిలియన్ల గెలాక్సీ పరికరాల్లో గెలాక్సీ ఏఐని చేర్చాలని యోచిస్తున్నామని రోహ్ వివరించారు.