
న్యూఢిల్లీ: ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీకి సెప్టెంబరుతో ముగిసిన రెండవ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టం రూ. 657 కోట్ల నుంచి రూ.625.53 కోట్లకు తగ్గింది. కంపెనీ గత నెలలో పబ్లిక్కు వచ్చిన తర్వాత తొలిసారిగా తన క్వార్టర్లీ ఫలితాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించింది. జులై-సెప్టెంబర్ క్వార్టర్లో కార్యకలాపాల ద్వారా స్విగ్గీ ఆదాయం రూ. 3,601.45 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,763.33 కోట్లుగా ఉంది. ఈ క్వార్టర్లో దాని మొత్తం ఖర్చులు కూడా రూ.4,309.54 కోట్లకు పెరిగాయి.