
లక్సెటిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణం కోర్టు సమీపంలో శివశంకర్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడు వద్ద ఆదివారం ముస్లింల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్థానిక సీఐ నరేందర్, ఎస్సై సతీశ్హాజరై ప్రారంభించారు. సీఐ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ముస్లింలు అన్నదాన కార్యక్రమం చేపట్టడం హర్షనీయమన్నారు. ఐకమత్యంగా ఉంటూ పండగలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.