భద్రాచలం రామాలయంలో ఫుడ్ ఇన్​స్పెక్టర్​ తనిఖీలు : కిరణ్​కుమార్​

భద్రాచలం రామాలయంలో ఫుడ్ ఇన్​స్పెక్టర్​ తనిఖీలు : కిరణ్​కుమార్​

భద్రాచలం, వెలుగు: రామాలయంలో సోమవారం ఫుడ్ ఇన్​స్పెక్టర్​ కిరణ్​కుమార్​ తనిఖీలు నిర్వహించారు.  తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈఓ  రమాదేవి ఫుడ్ ఇన్​స్పెక్టర్​కు  లేఖ రాశారు. దీంతో ఆయన ఆలయంలోని స్టోర్స్ ను సందర్శించారు. అన్నదానం, ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను  సేకరించారు. నెయ్యి, నూనె, పప్పులు, పంచదార, పిండి శాంపిల్స్​ సేకరించారు. వాటిని ల్యాబ్​కు పంపించి నాణ్యతను టెస్ట్ చేస్తామని ఫుడ్ ఇన్స్ పెక్టర్​ కిరణ్​కుమార్​ తెలిపారు.