హనుమకొండ ఆర్డీ కాలేజీలో ఫుడ్‌‌‌‌‌‌‌‌ పాయిజన్‌‌‌‌‌‌..‌ 26 మంది స్టూడెంట్లకు అస్వస్థత

హనుమకొండ ఆర్డీ కాలేజీలో ఫుడ్‌‌‌‌‌‌‌‌ పాయిజన్‌‌‌‌‌‌..‌ 26 మంది స్టూడెంట్లకు అస్వస్థత

హనుమకొండ, వెలుగు : హనుమకొండ నగరంలోని కిషన్‌‌‌‌‌‌‌‌పురలో ఉన్న ఆర్డీ జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో గురువారం ఫుడ్‌‌‌‌‌‌‌‌ ఫాయిజన్‌‌‌‌‌‌‌‌ జరిగింది. పేరెంట్స్  తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్డీ కాలేజీలో ఇంటర్​ చదువుతున్న 26 మంది విద్యార్థినులు గురువారం మధ్యాహ్నం భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ సిబ్బంది వారిని వెంటనే గుట్టుచప్పుడు కాకుండా హనుమకొండలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్​మెంట్​ అందించారు.

శుక్రవారం ఉదయం విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాలేజీకి చేరుకున్న పేరెంట్స్​ ఆందోళనకు దిగారు. పిల్లల ప్రాణాల మీదకు వచ్చినా, సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం పేరెంట్స్ కు సర్ది చెప్పి ఇండ్లకు పంపించినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు.

ఈ విషయమై కాలేజీ డైరెక్టర్​ మల్లేశంను వివరణ కోరగా.. ఫుడ్​ పాయిజన్​ జరగలేదని, నలుగురు స్టూడెంట్లు ఇబ్బందికి గురైతే వారిని ఆసుపత్రిలో చూపించినట్లు తెలిపారు.