
ములుగు, వెలుగు : సోషల్ వెల్ఫేర్ గురుకులంలో 6, 8వ తరగతి చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులకు ఫుడ్పాయిజన్ అయ్యింది. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న స్టూడెంట్లకు టీచర్లు దవాఖానకు వెళ్లడంటూ ఉచిత సలహా ఇచ్చి పంపించారు. దీంతో విద్యార్థులే అటెండెంట్ లేకుండా ములుగు ఏరియా దవాఖానకు వెళ్లాల్సి వచ్చింది. వసతులు లేకపోవడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం సోషల్ వెల్ఫేర్గురుకులాన్ని ములుగు మండలం మల్లంపల్లిలోని మామాడితోటలోని బిల్డింగ్లో నిర్వహిస్తున్నారు.
ఇక్కడ 5 వతరగతి నుంచి ఇంటర్వరకు 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత కొంతమంది విద్యార్థులు కడుపునొప్పి తో మెలికలు తిరిగిపోయారు. దీంతో కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సోమవారం ఉదయం ఆలు రైస్ తిన్న 6,8 తరగతులు చదువుతున్న ఎనిమిది మందికి వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో వారిని దవాఖానకు వెళ్లాలని టీచర్లు చెప్పి పంపించారు. అటెండెంట్, వార్డెన్, టీచర్లు లేకుండానే స్టూడెంట్స్ ములుగుకు వెళ్లారు. బస్టాండ్లో తల్లిదండ్రులకు ఫోన్ చేయగా, వారు వచ్చి పిల్లలను దవాఖానలో జాయిన్ చేశారు. తర్వాత ప్రిన్సిపాల్నర్సయ్యకు ఫోన్చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్సత్యనారాయణ స్వామి దవాఖనకు వచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.