గీతం యూనివర్సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

గీతం యూనివర్సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
  • పాడైపోయిన చికెన్, ఫంగస్​ సోకిన కూరగాయల గుర్తింపు

పటాన్​చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో పాడైపోయిన చికెన్, ఫంగస్​ఉన్న కూరగాలయను ఫుడ్​ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆదివారం అధికారులు వర్సిటీ బాయ్స్​హాస్టల్​మెస్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా తాగునీటి ట్యాంక్​తుప్పు పట్టి ఉండడం, ఉపయోగించిన నూనె వాడడం, కూరగాయలు ఫంగస్ సోకి ఉండటం గుర్తించినట్లు జిల్లా అధికారి ధర్మేందర్​ తెలిపారు. దాదాపు 224 కిలోల పాడైపోయిన పచ్చి చికెన్,  గడువు ముగిసిన టీ, కాఫీ పౌడర్, స్ప్రింగ్ రోల్, లేబిల్ లేని బిస్కెట్స్​ గుర్తించినట్లు చెప్పారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి  పంపించి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు