నాసిరకం సరుకులు, ఆహారపదార్థాల్లో పురుగులు శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్..

నాసిరకం సరుకులు, ఆహారపదార్థాల్లో పురుగులు శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్..

 శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేసిన అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. హాస్టల్ లో పిల్లలకు వడ్డించే వస్తువులు కాలం చెల్లినవిగా గుర్తించారు. పాల ప్యాకెట్ నుండి నిల్వ ఉంచే పదార్థాలన్ని కుళ్లినవిగా నిర్ధారించారు. ఇంతకు ఎక్కడంటే.. జగిత్యాల జిల్లా జాబితాపూర్ లోని  శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు.

ఆహారపదార్దాల్లో పురుగులు,నాసిరకంగా ఉన్న పదార్థాలు వినియోగిస్తున్నారని గుర్తించారు. కాలం చెలిన వస్తువులను చెత్తలో అధికారులు పడేశారు. 3వ తరగతి నుండి 10 వ తరగతి వరకు హాస్టల్ లో వందలాది మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నట్టు గుర్తించారు. ఇలాంటి వస్తువులు తినడం వలన విద్యార్థులు అనారోగ్యలకు గురవుతారని అన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తెలిపారు.