
సిద్దిపేట జిల్లా ములుగు(హైదరాబాద్)లోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2022–-23 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ కోర్సులో అడ్మిషన్స్కు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: రెండేళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఐసీఏఆర్- ఏఐఈఈఏ పీజీ -–2022 ప్రవేశ పరీక్ష, బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ అకడమిక్ స్కోరు ఆధారంగా అడ్మిషన్స్ కేటాయిస్తారు.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తరగతులు డిసెంబర్ 5 నుంచి ప్రారంభమవుతాయి. www.fcrits.in వెబ్సైట్ చెక్ చేసుకోవాలి.