అటవీ నరికివేతపై చర్యలు ..కూల్చిన చెట్లకు కొలతలు

అటవీ నరికివేతపై చర్యలు ..కూల్చిన చెట్లకు కొలతలు
  • నలుగురిపై కేసు నమోదు

లింగంపేట, వెలుగు : లింగంపేట మండలం బోనాల్ అడవిలో చెట్ల  నరికివేతపై ఫారెస్టు ఆఫీసర్లు చర్యలు తీసుకున్నారు. సోమవారం వెలుగు దినపత్రికలో 'ఆగనిచెట్ల నరికివే తలు'అనే శీర్షికన ప్రచు రితమైన వార్తకు ఎల్లారెడ్డి అటవీరేంజ్​ అధికారి ఓంకార్​స్పందించారు. ఫారెస్టు సెక్షన్​ ఆఫీసర్ భాస్కర్​, బీట్​ అధికారి పర్వీన్​తో కలిసి  బోనాల్​ శివారులో కోతమిషన్ల సాయంతోసుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో కూల్చివేతలకు గురైన టేకు చెట్లను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. చెట్ల కాస్ట్​ను  బాధ్యుల నుంచి రికవరీ చేస్తామని 'వెలుగు'తో చెప్పారు.  అటవీ చట్టం ప్రకారం నలుగురిపై  కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో 8 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. వీరందిరిపై త్వరలోనే కోర్టులోచార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు.

అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం

 చెట్ల నరికివేతపై విచారణకు వచ్చిన అధికారులపై బోనాల్​ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నా పట్టించుకోలేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు.  బోనాల్ మెంగారం  గ్రామాల మధ్య మెయిన్​ రోడ్డు పక్కన   కొందరు గిరిజనులు  చెట్లను  నరికి వేస్తున్నారని ఆరోపించారు.  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  రేంజ్​ అధికారి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.  రేంజ్​ అధికారి వెంట బేస్​క్యాంపు సిబ్బంది జీవన్​, హరి ఉన్నారు.