షాద్ నగర్ ప్రింట్ మీడియా జర్నలిస్టుల కమిటీ ఏర్పాటు

షాద్ నగర్ ప్రింట్ మీడియా జర్నలిస్టుల కమిటీ ఏర్పాటు

షాద్ నగర్,వెలుగు: జర్నలిస్టులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు. బుధవారం షాద్ నగర్ టౌన్ లో యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు సమావేశమై నియోజకవర్గ ప్రింట్ మీడియా కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఖాజాపాషా,అధ్యక్షుడిగా మిద్దెల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా శ్రీశైలం ఎన్నికయ్యారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో ఎంతోమంది జర్నలిస్టులపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు నమోదు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకపై జర్నలిస్టులపై దాడులు జరిగితే సహించబోమని, అక్రమ కేసులకు భయపడమని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.