
కొత్తకోట, వెలుగు: దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తకోట పట్టణానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాక బాలనారాయణ, కౌన్సిలర్ రామ్మోహన్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారంటీలు తనను ఆలోచింపజేశాయని చెప్పారు. మాజీ జడ్పీటీసీ పీజేబాబు, పల్లెపాగ ప్రశాంత్, మేస్ర్తీ శ్రీను పాల్గొన్నారు.