నాపై కావాలనే బురద చల్లుతున్నారు..నేను పార్టీ మారడం లేదు

నాపై కావాలనే బురద చల్లుతున్నారు..నేను పార్టీ మారడం లేదు
  •     కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు కావాలనే బురద జల్లుతున్నరు
  •     మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

పాలకుర్తి, వెలుగు : ‘నాపై కావాలనే బురద చల్లుతున్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనే పార్టీ మారే ప్రసక్తే లేదు’ అని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు స్పష్టం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో పార్టీ ఆఫీస్‌‌‌‌ను ప్రారంభించిన అనంతరం కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రతోనే కాంగ్రెస్‌‌‌‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కేసీఆర్‌‌‌‌ వెంటే ఉంటానని, రాబోయే రోజులు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌వేనన్నారు. కాంగ్రెస్‌‌‌‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు బోగస్‌‌‌‌ అని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారన్నారు.

ఎవరూ అధైర్యపడొద్దని, కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. పాలకుర్తి మండల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తల మధ్య సమన్వయలోపం ఏర్పడిందని, త్వరలోనే జిల్లా స్థాయి నాయకులను పిలిచి సమన్వయం చేస్తానని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, మండల అధ్యక్షులు పసునూరి నవీన్, తీగల దయాకర్, పల్లా సుందర్‌‌‌‌ రాంరెడ్డి ఉన్నారు.