ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పిల్లలు చనిపోతున్నరు : ఎమ్మెల్యే హరీశ్ రావు

 ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పిల్లలు చనిపోతున్నరు :  ఎమ్మెల్యే హరీశ్ రావు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్, వెలుగు: గురుకులాల సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థులకు శాపమవుతున్నదని, ప్రభుత్వ పట్టింపులేని తనం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నదని మాజీ మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ గురుకులానికి చెందిన నలు గురు విద్యార్థినులు కరెంట్ షాక్ తగిలి గాయాల పాలైన ఘటనపై ఆయన ట్విటర్​లో స్పందించారు. 

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసు కోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, ఫుడ్ పాయిజన్ కేసులు  సర్వసాధారణం అయ్యాయని, ఇప్పుడు ఆ జాబితాలో కరెంట్ షాకులు చేరాయని ఎద్దేవా చేశారు.