బుల్డోజర్ రాజ్‌గా మార్చొద్దు: మాజీ మంత్రి కేటీఆర్

బుల్డోజర్ రాజ్‌గా మార్చొద్దు: మాజీ మంత్రి కేటీఆర్
  • తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సలహా ఇవ్వండి
  • ఏఐసీసీ చీఫ్ ఖర్గేకి కేటీఆర్ రిక్వెస్ట్

హైదరాబాద్: తెలంగాణను మరో బుల్‌డోజర్‌ రాజ్‌గా మారకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ ఏఐసీసీ చీఫ్ ఖర్గేకి ​రిక్వెస్ట్​చేశారు. ‘ఖర్గే జీ.. మీరు చెప్పినట్లుగా, ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం అన్నారు. 

తెలంగాణలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతున్నది.మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చి వేశారు. నిన్న అక్రమంగా కూల్చివేసిన నిరుపేదల్లో 25 కుటుంబాలు శారీరక వికలాంగులు ఉన్నారు.

ఆమోదయోగ్యమైన పద్ధతులు పాటించకుండా, విధి విధానాలు లేకుండా అమలు చేసే చట్టం చట్టమే కాదు. అడ్డగోలుగా నిరుపేదలపైకి బుల్డోజర్ నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి.. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్​గా మార్చకుండా ఆదేశాలు ఇవ్వండి’ అని కేటీఆర్​సూచించారు.