రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని, టీడీపీ, బీజేపీ పొత్తు వల్లే తాను ఆ నాడు ఎంపీగా ఎన్నికయ్యానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చెప్పారు. ఇవాళ తన అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. తన మనవరాలి పెళ్లి కార్డును కిషన్ రెడ్డికి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము రాజకీయాలు మాట్లాడలేదని, తన మనవరాలి పెళ్లికి రావాలని ఆహ్వానించానని చెప్పారు. కిషన్ రెడ్డి రెండో సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. టీడీపీలో చేరుతున్నారా..? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాట వేశారు.