
కరీంనగర్ టౌన్, వెలుగు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కరీంనగర్ సిటీలోని తన నివాసంలో శనివారం పలువురు లీడర్లు పరామర్శించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ గొడిశల రాజేశంగౌడ్, మాజీ ప్రతినిధులు పిల్లి శ్రీలత,- మహేశ్.. తదితరులు లక్ష్మీనర్సమ్మ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గంగుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.