రేవంత్​రెడ్డి నోరు తెరిస్తే చావు గురించే మాట్లాడుతుండు : పువ్వాడ అజయ్​ కుమార్​

రేవంత్​రెడ్డి నోరు తెరిస్తే చావు  గురించే మాట్లాడుతుండు : పువ్వాడ అజయ్​ కుమార్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నోరు తెరిస్తే కేసీఆర్​ చావు గురించే సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ నేత పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. కొత్తగూడెంలోని బీఆర్​ఎస్​ జిల్లా ఆఫీస్​లో జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన శనివారం ఏర్పాటైన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు రేవంత్​ రెడ్డి లక్ష తులాల బంగారం బాకీ ఉన్నారన్నారు.

 రైతు బంధు జాడలేకుండా పోయిందన్నారు. కాళేశ్వరం కొట్టుకుపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్​ ఉగాది తర్వాత రంగంలోకి దిగుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు వచ్చే నెల 4 నుంచి మండలాల పర్యటనలు చేపట్టనున్నట్టు జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. 

బీఆర్​ఎస్​ ఆఫీస్​ ఎదుట నిరసన 

ఎంపీ ఎన్నికల ప్రచారంలో వాడుకొని పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ ఆటో ట్రాలీల యజమానులు మీటింగ్​ జరుగుతున్న బీఆర్​ఎస్​ పార్టీ ఆఫీస్​ గేట్​ ఎదుట ట్రాలీ పెట్టి నిరసన వ్యక్తం చేశారు.    పలువురు నాయకులు   ట్రాలీ యజమానులతో వాగ్వావాదానికి దిగారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు   వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.