
మహబూబాబాద్, వెలుగు: 27న ఎల్కతుర్తి సమీపంలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఆఫీసులో రజతోత్సవ సభ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.