మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్(Sushmitha sen) ట్రాన్స్జెండర్గా చేసిన తాలి అదరగొడుతోంది. ఈ రోల్తో ఈ హీరోయిన్ మరోసారి తానేంటో నిరూపించుకుంది. ఫామ్లో ఉన్నప్పుడే సినిమాలకు దూరమవ్వడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది.
‘అక్షయ్ కుమార్(Akshay kumar), కరీనా కపూర్(Kareena kapoor)తో కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తున్న టైంలో నా జీవితంలో అతిపెద్ద కుదుపు వచ్చింది. నా కూతురు రీనీ(Reeni)ని ఆస్పత్రిలో చేర్పించారని కండీషన్ సీరియస్ అని ఫోన్ వచ్చింది. విదేశాల్లో షూటింగ్లో ఉన్న నేను సినిమాను మధ్యలో ఆపేసి వచ్చేశాను. ఆ క్షణమే నాకు తెలుసు నా కెరీర్ ఇక్కడితో ముగిసిందని. నాకు కెరీర్పై సీరియస్నెస్ లేదని, అందుకే 24 ఏళ్లకే తల్లినయ్యానని కామెంట్స్ చేసేవారు. దీంతో నా పనిలో ఇంకా ఎక్కువ కష్టపడేదాన్ని.. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది’ అని సుస్మిత తెలిపింది. ఈ హీరోయిన్ దత్తత తీసుకున్న ఇద్దరమ్మాయిల్లో రీనీ ఒకరు.