
మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన స్వగృహంలో జులై 12వ తేదీ బుధవారం చనిపోయారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజోలు నియోజకవర్గం నుంచి 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో రాజోలు ఎస్సీ రిజర్డ్వ్ అయిన తర్వాత పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ప్రస్తుతం అల్లూరి కృష్ణంరాజు వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయన భార్య మల్లీశ్వరి టీటీడీ పాలకవర్గ సభ్యురాలిగా ఉన్నారు.
గత ఎన్నికల్లో జనసేనలో ఉండి ఆ పార్టీ అభ్యర్థి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విజయాం కోసం అల్లూరి కృష్ణం రాజు కృషి చేశారు. జనసేన పార్టీ రాష్ట్రంలో రాజోలులో మాత్రమే గెలవడానికి కారణం కృష్ణంరాజే కారణం. కృష్ణంరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా కృష్ణంరాజు మృతి పట్ల వైసీపీ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.