రాష్ట్రంలో నియంత పాలన నడుస్తున్నదా? : జీవన్ రెడ్డి

రాష్ట్రంలో నియంత పాలన నడుస్తున్నదా? : జీవన్ రెడ్డి
  • మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్న

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో రేవంత్​పాలన కొనసాగుతున్నదా.. నియంత పాలననా అని బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్​ రాజ్యాంగం పోయి ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యాంగం వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అరెస్టయిందని చెప్పారు. 

ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటికీ కేసులు పెట్టడమా అని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్​అరాచకాలను పింక్​బుక్​లో రాసుకుంటున్నామని పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్​షాడో సీఎం అయితే.. రేవంత్​ డమ్మీ సీఎం అయ్యారని విమర్శించారు.