
జనగామ/ బచ్చన్నపేట, వెలుగు: ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జనగామ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి కోరారు. శనివారం జిల్లా కేంద్రమైన జనగామలో భారీ బైక్ర్యాలీ, రోడ్షో, బచ్చన్నపేట మండల కేంద్రం, గోపాల్నగర్, చిన్నరామచర్ల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ ప్రజాపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉండేందుకు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజమౌళి, బచ్చన్నపేట మండలాధ్యక్షుడు నూకల భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.