- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు కూన శ్రీశైలం గౌడ్ వార్నింగ్.
జీడిమెట్ల, హైదరాబాద్ సిటీ, వెలుగు : సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేస్తే కుత్బుల్లాపూర్ గల్లీల్లో ఉరికించి కొడతామని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ఎమ్మెల్యే వివేకానంద్కు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం గాజులరామారంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన వివేకానంద్కు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం వివేకానంద్ నైజం అని మండిపడ్డారు. అనేక మందిపై దాడులు చేసిన చరిత్ర వివేకానంద్ది అని, ఎన్నికల సమయంలో తనపైనా దాడిచేశాడని చెప్పారు.
తనకు సంస్కారం ఉండటంతోనే తిరిగి దాడి చేయలేదని తెలిపారు. రాష్ట్రంలోని భద్రత గురించి వివేకానంద్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తన భాషను మార్చుకోకపోతే ఎమ్మెల్యేను కుత్బుల్లాపూర్ నియోకవర్గంలో తిరగయనియ్యబోమని, గల్లీల్లో ఉరికించి కొడతామని హెచ్చరించారు.