మాజీ MLA షకీల్ కుమారుడికి హైకోర్టులో బెయిల్ నిరాకరణ

మాజీ MLA షకీల్ కుమారుడికి హైకోర్టులో బెయిల్ నిరాకరణ

హైదరాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్ కారు యాక్సిడెంట్ కేసులో హైకోర్టు బెయిల్ మంజురుకు నిరాకరించింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్డు ప్రమాదంలో షకీల్ కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించారు. రహేల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసి, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.

ఈ కేసులో రహేల్ ను తప్పించేందుకు తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్లు చూపించారు నిందితులు. కానీ.. అసలు నిందితుడు రహేల్ గా పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజీ చూసి అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. యాక్సిడెంట్ తర్వాత రహేల్ దుబాయ్ పారిపోయాడు. 2024 ఏప్రిల్ 8 సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రహేల్‌ను అదుపులోకి తీసుకున్నారు.