
హుస్నాబాద్, వెలుగు: రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని ఓ మంత్రి అహంకారంగా మాట్లాడుతున్నారని, ఎవరు ఎవరిని కొడతారో కొద్దిరోజుల్లోనే తేలుతుందని హుస్నాబాద్మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలం వచ్చినా రైతులకు పెట్టుబడిసాయాన్ని అందించని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. రాబోయే, ఎంపీ, లోకల్బాడీ ఎన్నికల్లో ప్రజలు కొట్టే దెబ్బకు మంత్రుల అహంకారం దిగుతుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు.