వైసీపీలోకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. డేట్ ఫిక్స్..

వైసీపీలోకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. డేట్ ఫిక్స్..

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెజ్ సీనియర్ లీడర్, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరను న్నారు. ఫిబవ్రి 26న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మో హన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఉండవల్లి చేరిక వైసీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం రానుంది. ఉండవల్లి బాటలో మరికొంత మంది కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరునున్నట్లు వార్తలు వస్తున్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల పార్టీ ఓటమి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. దఫాలుగా కాంగ్రెస్ నేతలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

ALSO READ | షర్మిలకు ఝలక్.. వైసీపీలోకి శైలజా నాథ్.. కారణం ఇదేనా..?

జగన్ వ్యూహం ఫలించినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల మాజీ  మంత్రి శైలజనాథ్ వైసీపీలో చేరారు. ఇప్పుడు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. 2014 నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 

మరోవైపు సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అస్త్రాన్ని ప్రయోగిస్తూ పార్టీ శ్రేణులో నూతనోత్తేజం నింపుతున్నారు. ఉగాది తర్వాత జిల్లాల్లో పర్యటిం చేందుకు సిద్ధం అవుతున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ పై ప్రణాళికలు సిద్ధమవుతున్నారు.