
- ముఖ్యమంత్రిని కలిసిన నర్సాపూర్మాజీ ఎమ్యెల్యే మదన్ రెడ్డి
- కాంగ్రెస్లో చేరిక ఇక లాంఛనమే
- వెంట నడవనున్న జిల్లా ముఖ్య నేతలు
మెదక్, నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలానికి చెందిన ఫుడ్కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన వెంట మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జిఆవుల రాజిరెడ్డి ఉన్నారు. మదన్రెడ్డి వెంట హత్నూర జడ్పీటీసీ మెంబర్ ఆంజనేయులు, కౌడిపల్లి మండల బీఆర్ఎస్ లీడర్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ లీడర్లు, చిలప్చెడ్ మాజీ జడ్పీటీసీ శేషసాయిరెడ్డి ఉన్నారు.
అసెంబ్లీ టికెట్ నిరాకరించినప్పటి నుంచే..
మదన్రెడ్డి తెలంగాణ ఉద్యమ కాలం నుంచే టీఆర్ఎస్లో ఉన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్తరపున నర్సాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీకి సిద్ధంగా ఉన్నప్పటికీ హైకమాండ్ టికెట్నిరాకరించి 2019లో కాంగ్రెస్నుంచి టీఆర్ఎస్లో చేరిన సునీతారెడ్డికి ఇచ్చింది. దీంతో మదన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పుడే ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. అయితే, బీఆర్ఎస్ హైకమాండ్ వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో మెదక్ఎంపీ టికెట్ఇస్తామనే హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గి బీఆర్ఎస్అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన మాట తప్పి ఎంపీ టికెట్మదన్రెడ్డికి ఇవ్వకుండా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్వెంకట్రామిరెడ్డికి కేటాయించింది. దీంతో నారాజ్అయిన మదన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల కింద మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లనున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు, నర్సాపూర్ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కౌడిపల్లిలోని మదన్రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడారు. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని కోరారు. కానీ, మదన్రెడ్డి మాత్రం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరాలని డిసైడ్అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తేలిపోయింది. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి రెండు రోజుల్లో కాంగ్రెస్లో చేరనున్నట్టు తెలిసింది.