ఘనంగా అబ్దుల్​ కలాం జయంతి

ఘనంగా అబ్దుల్​ కలాం జయంతి

కోల్​బెల్ట్/కుంటాల, వెలుగు:​ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్​కలాం జయంతి వేడుకలను మంగళవారం మందమర్రిలో యువజన కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మనోవికాస్​మానసిక దివ్యాంగుల స్కూల్​లో పిల్లలతో కలిసి కేక్​కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అబ్దుల్​కలాం దేశ రక్షణ రంగం దిశను మార్చి క్షిపణి పితామహుడయ్యారని, అంతరిక్ష పరిశోధనలతో భారత్​ను ప్రపంచం స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు.

 యువతకు స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్ ​కలాం ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మహంత్ అర్జున్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో లీడర్లు కొలిపాక సదానందం, వేణు, ఓరుగంటి సురేందర్, మహంత్ కృష్ణ బాబు, శ్రీరామోజు సాయితేజ, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. 

అబ్దుల్​ కలాం జయంతిని కుంటాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఫొటోలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవలను వక్తలు కొనియా డారు. యూత్ నాయకులు జక్కు ల గజేందర్, పవన్, కాశీరాం గజేందర్, యువజన సంఘాల సభ్యులుపాల్గొన్నారు.