
పంజాగుట్ట, వెలుగు: పెండింగ్ బిల్లులు రిలీజ్చేయాలని కోరుతూ మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం బేగంపేటలోని ప్రజాభవన్లో నోడల్ ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు. బయటికి వచ్చాక వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ఆధ్వర్యంలో ప్రజాభవన్వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పంజాగుట్ట పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు. అరెస్ట్అయిన వారిలో జేఏసీ ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్రెడ్డి, కేశబోయిన మల్లయ్య, బొడ్డు నర్సింహులు, రవీందర్, దుర్గం నరేశ్యాదవ్ పాల్గొన్నారు.