రాధాకిషన్ రావు ఇంట విషాదం..

రాధాకిషన్ రావు ఇంట విషాదం..

ఫోన్ ట్యాపింగ్  కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్  మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట విషాదం నెలకొంది.  ఆయన తల్లి సరోజినీ దేవి కన్నుమూశారు.  కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  ఈ క్రమంలో తన తల్లి మృతి పట్ల  రాధాకృష్ణన్ రావు నాంపల్లి కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు  వేశారు. ఈ  పిటిషన్ పై మరికాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.  ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు రాధాకిషన్ రావు.