తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలను ఖండించారు ప్రముఖ వ్యాపార వేత్త టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా. తాను ఆరోగ్యంగా ఉన్నానని..ఎలాంటి ఆందోళన అవసరం లేదని తన ఎక్స్ లో తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని సూచించారు. వయసు రీత్యా ఆరోగ్య సమస్యలపై కొన్ని మెడికల్ టెస్టుల కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు చెప్పారు.
Also Read :- జిల్లా మేజిస్ట్రేట్కే నకిలీ బిస్లెరి వాటర్ సప్లయ్
రతన్ టాటా(86) లో బీపీ కారణంగా అస్వస్థతకు గురైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అక్టోబర్ 7న సోమవారం ఉదయం కుటుంబ సభ్యలు ఆయనను ముంబైలోని కాండీ హాస్పిటల్ కు తరలించారని.. టాటాకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో టాటా తన ఎక్స్ లో వివరణ ఇచ్చారు.
Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99
— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024