మహబూబ్‌‌నగర్‌లో‌ అమర రాజా ప్లాంట్​కు శంకుస్థాపన

మహబూబ్‌‌నగర్‌లో‌ అమర రాజా ప్లాంట్​కు శంకుస్థాపన

హైదరాబాద్‌‌, వెలుగు : అమరరాజా గ్రూప్‌‌ మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా దివిటిపల్లిలో సెల్‌‌ తయారీ కోసం కస్టమర్‌‌ క్వాలిఫికేషన్‌‌ ప్లాంట్‌‌ (సీక్యూపీ) శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించింది. భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక  ఆటోమోటివ్ బ్యాటరీ మేజర్‌‌లలో ఒకటైన అమర రాజా అడ్వాన్స్‌‌డ్ సెల్ టెక్నాలజీస్ (ఏఆర్​ఏసీటీ)కి  అమర రాజా ఎనర్జీ అండ్​ మొబిలిటీ లిమిటెడ్ (ఏఆర్​ఈఎం)  పూర్తి అనుబంధ సంస్థ. బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ మొదటిదశను 1.5 గిగావాట్​అవర్​ప్రస్తుత సామర్థ్యంతో, రూ.9,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభించింది.

ఈ ప్లాంట్ భారతీయ పరిస్థితులకు ప్రత్యేకంగా లీఅయాన్ బ్యాటరీ ప్యాక్‌‌లను తయారు చేస్తుంది.  స్టేషనరీ ఎనర్జీ స్టోరేజ్ అవసరాల కోసం వీటిని ఈవీ కంపెనీలకు సరఫరా చేస్తుంది. ఈ ప్లాంటు వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో పనిచేయడం మొదలుపెడుతుంది. ఇదిలా ఉంటే, అమర రాజా అడ్వాన్స్‌‌డ్ సెల్ టెక్నాలజీస్ (ఏఆర్​ఏసీటీ) బ్యాటరీల తయారీ కోసం ఇటాలియన్​ ఆటో కంపెనీ పియాజియో తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  

ఈ ఒప్పందంలో భాగంగా, అమర రాజా పియాజియో ఇండియాతో కలిసి  లిథియం ఐరన్ ఫాస్ఫేట్,  లిథియం- అయాన్ సెల్‌‌లు,  ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జర్‌‌లను అభివృద్ధి చేయడంతో పాటు సెల్‌‌లు  బ్యాటరీ ప్యాక్‌‌లను డెవలప్ చేస్తుంది. వీటిని దివిటిపల్లిలోని అమర రాజాస్ గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తారు.