
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్, నందిపేటలో గురువారం మోటర్ వెహికల్ ఆఫీసర్స్ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూల్బస్సులను తనిఖీ చేశారు. ఆర్మూర్లో సరైన డాక్యుమెంట్స్, నందిపేట్ లో ఫిట్నెస్లేకుండా నడుపుతున్న మూడు బస్సులను, ఆర్మూర్లో ఒక బస్సును సీజ్ చేసినట్లు ఆర్మూర్ఎంవీఐ వివేకానందరెడ్డి తెలిపారు. తనిఖీల్లో ట్రైనీ ఏఎంవీఐలు నల్ల శ్రీనివాస్, బండారి పవన్ కల్యాణ్, కుమ్మరి సాగర్, ఘణపురం రోహిత్రెడ్డి పాల్గొన్నారు.