మేం అక్కడికి వెళ్లం.. ఇక్కడే ఉంటాం.. క్యాట్‎ను ఆశ్రయించిన ఐఏఎస్‎లు

మేం అక్కడికి వెళ్లం.. ఇక్కడే ఉంటాం.. క్యాట్‎ను ఆశ్రయించిన ఐఏఎస్‎లు

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతోన్న ఏపీ కేడర్‎కు చెందిన 11 మంది ఐఏఎస్‎లను తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‎గా కొనసాగుతోన్న ఆమ్రపాలితో పాటు మరో 10 మంది ఐఏఎస్‎లకు డిపార్ట్‏మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సెంటర్ (డీఓపీటీ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో డీఓపీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నలుగురు ఐఏఎస్‎లు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఐఏఎస్‎లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, సృజన, వాణి ప్రసాద్ వేర్వేరుగా క్యాట్‏లో పిటిషన్లు దాఖలు చేశారు. 

ఏపీకి వెళ్లాలని డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి.. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్ క్యాట్‎కు విజ్ఞప్తి చేయగా.. ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన క్యాట్‎లో పిటిషన్ వేశారు. ఐఏఎస్‎ల పిటిషన్లపై 2024, అక్టోబర్ 15న క్యాట్ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. కాగా, ఏపీ కేడర్‎కు చెందిన 11 మంది ఐఏఎస్‎లు తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ALSO READ |చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలం: డిప్యూటీ సీఎం పవన్..

 11 మంది ఐఏఎస్ ల రిక్వెస్ట్ ను సెంట్రల్ గవర్నమెంట్ తిరస్కరించింది. తిరిగి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్‎లు క్యాట్‎ను ఆశ్రయించారు. దీంతో క్యాట్ తీర్పుపై  ఉత్కంఠ నెలకొంది. ఐఏఎస్‎ల రిక్వెస్ట్‎కు సానుకూలంగా స్పందిస్తుందా లేదా తిరిగి ఏపీ వెళ్లాల్సిందేనని చెబుతుందా అని క్యాట్ నిర్ణయంపై సస్పెన్స్ నెలకొంది.