అమెరికాలో కాల్పులు నలుగురు మృతి

అమెరికాలో కాల్పులు నలుగురు మృతి

బర్మింగ్ హామ్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపా యి. శనివారం రాత్రి బర్మింగ్ హామ్​లోని ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 21 మందికి పైగా తీవ్రమైన గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న బర్మింగ్ హామ్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ప్రైవేటు వెహికిల్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.