విహారయాత్రలో విషాదం: నలుగురు మృతి

విహారయాత్రలో విషాదం: నలుగురు మృతి

కడప: విహారయాత్రలో విషాదం నిండింది. ఆంధ్ర ప్రదేశ్ కడప జిల్లా పెన్నానదిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు పిల్లలు ఒక యువకుడు ఉన్నట్లు  పోలీసులు తెలిపారు. చనిపోయిన వారు కర్నాటక లోని రాయ్ చూర్ కు చెందిన వారిగా పోలీసులు చెప్పారు. కర్నాటక లో నివాసం ఉంటున్న ఓ ఫ్యామిలీ కడపలో ఉంటున్న వారి చుట్టాల ఇంటికి వెళ్లారు. దీంతో అందరు కలిసి పెన్నానదిని చూడడానికి వెళ్లారు. అక్కడే ఉన్న ఓ కుంటలోకి ఈతకు వెళ్లిన ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. వాళ్లను కాపాడడానికి వెళ్లిన యువకుడు కూడా చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు.