
= భారీ మెజార్టీలతో సత్తా
= పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, వరంగల్ నుంచి కావ్య, నల్లగొండ నుంచి రఘువీర్ రెడ్డి
హైదరాబాద్: ఈ పార్లమెంటు ఎన్నికల్లో బరిలో నిలిచిన నలుగురు వారసలు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో ముగ్గురు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. నాగర్ కర్నూల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు భరత్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముగ్గురు విజయం దిశగా దూసుకుపోతున్నారు. పెద్దపల్లి నుంచి పోటీ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు, మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి మనుమడు గడ్డం వంశీకృష్ణ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పై 75,365 ఓట్ల ఆధిక్యతను సాధించారు.
వరంగల్ నుంచి బరిలోకి దిగిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య 1,30,678 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తన సమీప ప్రత్యర్థి ఆరూరి రమేశ్ పై ఆధిక్యాన్ని సాధించారు. నల్లగొండ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి విజయం దిశగా దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డిపై 4,11,175 ఓట్ల ఆధిక్యతను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.