
వంగూరు, వెలుగు: మండలంలోని కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సోమవారం 350 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 40 మందికి ఆపరేషన్ అవసరమని గుర్తించారు. మిగిలిన వారికి కంటి అద్దాలు, మందులు అందించారు. మాజీ ఉప సర్పంచ్ ఎనుముల వేమారెడ్డి, రాజశేఖర్,రెడ్డి, చందు యాదవ్, బాబు యాదవ్ పాల్గొన్నారు.