
మెదక్ జిల్లా కౌడిపల్లిలోని బేయర్ - రామనాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయంలో ఆరునెలల ఉచిత శిక్షణ కు ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించి ఆధునిక వ్యవసాయ విధానాల్లో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. 2019 జూలై నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. అర్హత: పదోతరగతి /తత్సమాన ఉత్తీర్ణత. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.60 వేలకు మించకూడదు. గ్రామీణ వ్యవసాయం లేదా వ్యవసాయంలో పని చేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. వయసు: 16 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, పదోతరగతి మార్కుల జాబితా, తాజా ఇన్కం సర్టిఫికెట్ ను సంస్థ అడ్రస్కు గడువు తేదీలోగా పంపాలి. లేదా స్కాన్డ్ డాక్యుమెంట్స్ drnvjird@gmail.com కు మెయిల్ చేయవచ్చు. ఇన్స్టిట్యూట్లో నేరుగా ఇవ్వవచ్చు. చివరితేది: 2019 జూన్ 25; చిరునామా: డైరెక్టర్, బేయర్ - రామనాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, తునికి గ్రామం, కౌడిపల్లి మండలం, మెదక్ జిల్లా, 502316; ఫోన్ నెంబర్: 8185060769, 8919492493