నిమ్స్​లో ఫ్రీ వాటర్​ఏటీఎం ప్రారంభం

నిమ్స్​లో ఫ్రీ వాటర్​ఏటీఎం ప్రారంభం

పంజాగుట్ట,వెలుగు : నిమ్స్​ఆస్పత్రిలో అత్యాధునిక వాటర్ ఏటీఎంను ప్రారంభించారు.  సేఫ్​వాటర్​ నెట్ వర్క్ ఇండియా స్వచ్ఛంద సంస్థ , నిమ్స్​సౌజన్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో  కూడిన వాటర్ ఏటీఎంను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. శుక్రవారం నిమ్స్​ డైరెక్టర్​డాక్టర్​ నగరి బీరప్ప ఏటీఎంను ప్రారంభించి మాట్లాడారు. 

జీరో వేస్టేజ్​టెక్నాలజీతో నాణ్యమైన తాగునీటిని పేషెంట్లు, సహాయకులకు అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. అసిస్టెంట్​మెడికల్​సూపరింటెండెంట్​డాక్టర్​ చరణ్​, డాక్టర్​సల్మాన్​, మీడియా రిలేషన్​ అధికారి సత్యగౌడ్​, సేఫ్​ వాటర్​నెట్ వర్క్ ఇండియా హెడ్​ఆఫ్​ఆపరేషన్​శంకర్​లాల్​ బత్రా,మల్లికార్జున్​ ,శ్రీకాంత్, జితేందర్​ ఉన్నారు.