నిధుల దుర్వినియోగం కేసులో ఎఫ్ఆర్ఓ అరెస్ట్

నిధుల దుర్వినియోగం కేసులో ఎఫ్ఆర్ఓ అరెస్ట్

ఏటూరునాగారం, వెలుగు: తునికాకు బోనస్​ డబ్బులు కింది స్థాయి ఉద్యోగుల ఖాతాలకు మళ్లించి సొంతానికి వాడుకున్న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం​పసర ఎఫ్ఆర్వో బాలరాజును అరెస్ట్  చేసి రిమాండ్​కు పంపినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. 

ఏటూరునాగారం నార్త్​ రేంజ్  అధికారిగా పని చేసిన బాలరాజు తునికాకు కూలీలకు ఇవ్వాల్సిన రూ.2.70 లక్షల బోనస్  డబ్బులు ఔట్  సోర్సింగ్​ ఉద్యోగుల బ్యాంక్​ అకౌంట్లకు బదిలీ చేయించి, తన సొంతానికి వాడుకున్నట్లు విచారణలో తేలిందని ఏఎస్పీ తెలిపారు.