ఎండాకాలం వద్దు ఫికర్..రిజర్వాయర్లలో ఫుల్లు వాటర్! నిరుడుతో పోలిస్తే రిజర్వాయర్లలో మెరుగ్గా వాటర్ ​లెవల్స్

ఎండాకాలం వద్దు ఫికర్..రిజర్వాయర్లలో ఫుల్లు వాటర్! నిరుడుతో పోలిస్తే రిజర్వాయర్లలో మెరుగ్గా వాటర్ ​లెవల్స్
  • నాగార్జునసాగర్​లో ప్రస్తుతం 203 టీఎంసీలు  
  • గత ఏడాది ఈ టైంకు146 టీఎంసీలు మాత్రమే.. 
  • ఎల్లంపల్లిలో 15.5,సింగూరులో 24.7 టీఎంసీలు  
  • ఈసారి నీటి సరఫరాకు ఢోకా లేదంటున్న వాటర్​బోర్డు  

హైదరాబాద్​సిటీ, వెలుగు:గ్రేటర్​హైదరాబాద్​కు తాగునీటిని అందించే ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షాలు బాగా కురవడంతో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయని వాటర్​బోర్డు అధికారులు చెప్తున్నారు. దీంతో ఈసారి గ్రేటర్​పరిధిలోని అన్ని ప్రాంతాలతో పాటు ఔటర్​రింగ్​రోడ్​పరిధిలోని ఏరియాలకూ నీటి సరఫరాలో ఢోకా ఉండదని చెప్తున్నారు. గ్రేటర్​లో 13.80లక్షల వాటర్​కనెక్షన్లు ఉండగా ఔటర్​పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు బల్క్​పద్ధతిలో వాటర్​బోర్డు నీటి సరఫరా చేస్తోంది. 

గత ఏడాది భూగర్భజలాలు పడిపోవడంతో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో ట్యాంకర్ల ద్వారా రాత్రింబవళ్లు నీటి సరఫరా చేయాల్సి వచ్చింది. ఈ సారి రిజర్వాయర్లలో నీళ్లు కూడా ఎక్కువ ఉండడంతో పైన ఏరియాలతో పాటు ఇటీవల విలీనమైన 52 గ్రామాలకు కూడా నీటి సరఫరా చేసేందుకు బోర్డు సిద్ధంగా ఉందని అధికారులు చెప్తున్నారు.  

650 ఎంజీడీల్లో 600 వరకు.. 

ప్రస్తుతం గ్రేటర్​లో రోజుకు 650 ఎంజీడీల నీటికి డిమాండ్​ఉండగా 500 ఎంజీడీలు సప్లయ్​చేస్తున్నారు. వాస్తవానికి 550 ఎంజీడీలు తీసుకువస్తున్నా, ఇందులో 50 ఎంజీడీలు స్టోరేజీ చేస్తున్నారు. ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్​ జంటజలాశయాల నుంచి 30 ఎంజీడీలు, ఎల్లంపల్లి (గోదావరి నుంచి160 ఎంజీడీలు)నాగార్జునసాగర్​నుంచి కృష్ణా మూడు దశల ద్వారా 270 ఎంజీడీలు, సింగూరు, మంజీరా నుంచి 90 ఎంజీడీలు కలిపి 550 ఎంజీడీలు తరలిస్తున్నారు. 

గత ఏడాది కూడా 550 ఎంజీడీలు తీసుకువచ్చినా ఈసారి రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉండడంతో మరికొంత నీటిని తరలించేందుకు అవకాశం ఉందంటున్నారు. మార్చి నుంచి మరో 50 ఎంజీడీలు, డిమాండ్​పెరుగుతుంది కాబట్టి ఏప్రిల్​, మే నెలల్లో మరో 50 ఎంజీడీలు అతి కష్టం మీద తీసుకురావచ్చంటున్నారు. ఎల్లం పల్లి నుంచి సిటీకి సరఫరా అవుతున్న గోదావరి జలాల్లో 50 ఎంజీడీలను రూరల్​వాటర్​సప్లయ్​ (ఆర్​డబ్ల్యూఎస్​) ట్యాప్​ చేసి తీసుకుంటోంది. వీటితో నల్లగొండ, జనగాం, భువనగిరి జిల్లాలకు తాగునీరందిస్తున్నారు. 

ఈసారి ఇందులో 15 ఎంజీడీలను హైదరాబాద్​కే తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి నుంచే పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్​తట్టుకునేందుకు ఈ వాటర్​వినియోగించాలని నిర్ణయించారు. మరో 35 ఎంజీడీలను కృష్ణా ఫేజ్​-1, 2,3 నుంచి కొంత అదనంగా డ్రా చేసి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ నీటిని ఔటర్​ రింగ్​రోడ్​పరిధిలోని ప్రాంతాల్లో వినియోగించాలని భావిస్తున్నారు.  నీటి వృథాను అరికట్టడం, అక్రమ వినియోగాన్ని, వృథా తగ్గించడం వల్ల మరిన్ని నీళ్లు మిగులుతాయని చెప్తున్నారు. ఇందులోభాగంగా ఉస్మాన్​సాంగర్​కాండ్యూట్​లీకేజీలను అరికట్టామని, మంజీరా పైప్​లైన్లకు రిపేర్లు చేసి చాలా నీటిని వృథా కాకుండా చూస్తున్నామని, ఈనీటిని అవసరమున్న ప్రాంతాలకు వినియోగిస్తామని అంటున్నారు.  

నీటి నిల్వలు ఇలా..

గత ఏడాది ఇదే నెలలో నాగార్జునసాగర్​లో 146 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు 203 టీఎంసీలు ఉన్నాయి. ఎల్లంపల్లిలో నిరుడు 12..ప్రస్తుతం 15.5 టీఎంసీలు, సింగూరులో గత సంవత్సరం 22 , ప్రస్తుతం 24.700 , మంజీరాలో అప్పుడు 0.786 , ఇప్పుడు 1.088, ఉస్మాన్​సాగర్​లో గత ఏడాది 3.061, ఇప్పుడు 3.553, హిమాయత్​ సాగర్​లో 2024లో 2.416 టీఎంసీలు, ఈ ఏడాది 2.560 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కాగా, ఎల్లంపల్లి పల్లి నుంచి సాగునీటి కోసం కొంత ఆపుకుని హైదరాబాద్​ కు పూర్తి స్థాయిలో తాగునీటి కోసం గోదావరి నీరు ఇచ్చేలా చూడాలని ఇప్పటికే మెట్రోవాటర్​బోర్డు..ఇరిగేషన్​ అధికారులకు లెటర్​రాసింది.


సిటీకి తాగునీరు అందించే జలాశయాల్లోని నీటి నిల్వలు(టీఎంసీల్లో)

జలాశయం    పూర్తి సామర్థ్యం    గత సంవత్సరం    ప్రస్తుతం
నాగార్జున సాగర్​     312.045    146.370    203.860
ఎల్లంపల్లి(గోదావరి)      20.175        12.091        15.453
సింగూరు          29.917         22.809        24.653
మంజీరా         1.500        1.271        1.271
ఉస్మాన్​సాగర్​    3.900        3.061        3.533
హిమాయత్​సాగర్​    2.967        2.416        2.560