
ఊరంతా కలిసి పెంచుకున్న ఆవు.. గడప గడపకు వచ్చి ఇచ్చిన ఆహారం తిని వెళ్లే ఆవు.. అందరి కంట్లో ప్రతిరోజూ మెదులుతూ.. ఇంట్లో మనిషిలాగా కలిసిపోయిన ఆవు.. ఉన్నట్లుండి అనారోగ్యం బారిన పడి చనిపోవడం ఆ ఊరిని కన్నీటి సంద్రంలో ముంచింది. ఆవు లేదన్న వార్త ఆ గ్రామ ప్రజలను జీర్ణించుకోలేకుండా చేసింది. దీంతో ఇంట్లో మనిషికి చేసినట్లుగా అంతిమయాత్ర చేసి అంత్య క్రియలు నిర్వహించారు గ్రామస్తులు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరెల్లి గ్రామంలో జరిగాయి ఈ అంత్యక్రియలు. ఊరంతా అప్యాయంగా పెంచుకున్న ఆవు అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది ఆ గ్రామంలో. తమ డప్పు వాయిద్యాల మద్య అంత్యక్రియలు నిర్వహించారు గ్రామస్థులు.
ఆవు తమకు దూరం కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు మహిళలు. గ్రామం అంతా కలిసి ఆవుకు శాస్త్రోత్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. పెంచుకున్న ఆవు మళ్లీ కనిపించదనే బాధతో గ్రామ ప్రజలంతా చివరి వీడ్కోలులో పాల్గొన్నారు.