
రంగారెడ్డి: షాద్నగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని జేపీ ఫర్నిచర్ షాపులో ప్రమాదవ శాత్తు మంటల చెలరేగాయి. ఈ ప్రమాదంలో షాపులో ఉన్న ఫర్నీచర్ మొత్తం తగలబడిపోయింది. షాపు నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ 10లక్షల ఆస్థినష్టం ఉంటుందన అంచనా వేస్తున్నారు.