ఆడపిల్లల భవిష్యత్ కు గ్యారంటీ లేకుండా పోయింది : బండి సంజయ్

ఆడపిల్లల భవిష్యత్ కు గ్యారంటీ లేకుండా పోయింది : బండి సంజయ్

మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త నుండి కోలుకోకముందే నర్సంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ర్యాగింగ్ కు బలికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో ఆడపిల్లల భవిష్యత్ కు గ్యారంటీ లేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ- అవినీతి- నియంత పాలనలో సామాన్యులు బతకలేని దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ విమర్శించారు. "ప్రజాస్వామ్యవాదులారా... మీ మౌనం సమాజానికే అరిష్టం...  ఇకనైనా నోరు విప్పండి..." అని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు కళ్లముందే చస్తున్నా స్పందించకపోవడం మానవత్వానికే కళంకమని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూండా, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన అసవరం మనందరిపైనా ఉందని స్పష్టం చేశారు.