జాబ్స్ స్పెషల్..జీ-20 ఆర్థిక మంత్రుల సమావేశాలు

జాబ్స్ స్పెషల్..జీ-20 ఆర్థిక మంత్రుల సమావేశాలు

జీ–20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్​ఎంసీబీజీ) సమావేశాలు కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగాయి. భారత్​ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, ఇండోనేషియా ఆర్థిక మంత్రి ముల్యాని ఇంద్రావతి, బ్రెజిల్​ కేంద్రీయ బ్యాంక్​ గవర్నర్​ రాబర్ట్​ డి ఒలివైరా, ఐఎంఎఫ్​ ఎండీ క్రిస్టలినా జార్జివా పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆన్​లైన్​ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. 

 ఈ సదస్సుకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అధ్యక్షత వహించారు. జీ–20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల సమావేశాల తొలి సెషన్​ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గవర్నర్​ శక్తికాంత దాస్​ కలిసి నిర్వహించారు. సమర్థ పాలన,  సమగ్ర అభివృద్ధి, ఆవిష్కరణలకు డిజిటల్​ పబ్లిక్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ (డీపీ‌‌‌‌ఐ) అంశంపై నిర్వహించిన సదస్సులో ఆర్థిక మంత్రులు, నిపుణులు మాట్లాడారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్​ డైరెక్టర్​ క్రిస్టలీనా జార్జివా ప్రసంగించారు. 2023 అంతర్జాతీయ వృద్ధిలో భారత్​ వాటా సుమారు 15శాతం ఉండొచ్చని అంచనా వేశారు.

ఉక్రెయిన్​ యుద్ధంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సంయుక్త ప్రకటన లేకుండానే బెంగళూరులో జరిగిన జీ–20 ఆర్థిక మంత్రుల సదస్సు ముగిసింది. సరిహద్దు చెల్లింపులు, డిజిటల్​ మౌలిక సదుపాయాల్లో సురక్షిత ఆర్థికతను కొనసాగించేందుకు క్రిప్టో కరెన్సీ ఆవశ్యకతను గుర్తు చేసిన భారత అభిప్రాయానికి బ్రిటన్​, అమెరికా దేశాలు మద్దతు ఇచ్చాయి.