
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్డులోని వరలక్ష్మి టిఫిన్సెంటర్ లో స్టేట్ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించారు. ఎలుకల సంచరిస్తున్నాయని, డ్రైనేజీలోఆహార వ్యర్థాలు వేయడంతో మురుగు పొంగుతోందని గుర్తించారు.
కిచెన్లో పగిలిన ఫ్లోరింగ్, గోడలకు నూనె మరకలు, మూతలు లేకుండా ఉన్న డస్ట్బిన్లు అధికారుల కంటబడ్డాయి. కుకింగ్ఆయిల్ని మార్చకుండా వాడుతున్నట్లు గుర్తించారు. అలాగే మాదాపూర్లోని క్షత్రియ ఫుడ్రెస్టారెంట్లో సింథటిక్ కలర్స్వాడుతున్నట్లు గుర్తించారు. కిచెన్లోని రిఫ్రిజిరేటర్అధ్వానంగా ఉందని, అందులోనే చికెన్, మటన్ స్టోర్చేస్తున్నారని, రక్తం బయటకు కారుతోందని వెల్లడించారు.