మహనీయుడు కాకా..: సీఎం రేవంత్ రెడ్డి

మహనీయుడు కాకా..: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పేదల హృదయాల్లో దీపమై వెలిగిన మహనీయుడు కాకా వెంకటస్వామి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. శనివారం గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

‘‘కాకా వెంకటస్వామి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా రాష్ట్రానికి, దేశానికి ఎనలేని సేవలందించారు. సింగరేణి కార్మికుల జీవితాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో అలుపెరుగని పోరాటం చేశారు. 1969 ఉద్యమంలో తెలంగాణ కోసం జైలుకెళ్లారు. కాకా జీవితం కార్మికులు, పేదలతోనే మమేకమైంది. నిలువ నీడ లేని నిరుపేదలకు గూడు కల్పించాలని గుడిసెల పోరాటం చేశారు. పేదల కోసం కొన్ని వేల గుడిసెలు వేయించారు” అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.