బీసీ కుల గణన చారిత్రాత్మక నిర్ణయం : గాలి అనిల్​కుమార్​

బీసీ కుల గణన చారిత్రాత్మక నిర్ణయం : గాలి అనిల్​కుమార్​

రామచంద్రాపురం, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వే చారిత్రాత్మకమని, దేశంలో ఏ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు రాలేదని కాంగ్రెస్​ రాష్ట్ర నాయకుడు గాలి అనిల్​ కుమార్​అన్నారు. శనివారం బేగంపేటలోని పూలే భవన్​లో జరిగిన బీసీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న అనిల్​ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​ను కలిశారు. అనంతరం వారికి బొకే అందజేసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్​ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు కానున్నాయని, దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని పనిని సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీ సమాజమంతా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటుందని, దీనికి సహకరించిన కాంగ్రెస్​అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్​గాంధీ, కర్గేలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.